March 14, 2025
Artelugunews.in | Telugu News App
అల్లూరు జిల్లా

అర్హులైన వారికి మాత్రమే పశువుల మీని గోకులాలు మంజూరు చేయాలి. దేవి పట్నం పట్నం పశువుల హాస్పటల్ లో పశువుల డాక్టర్ను నియమించాలి. ఆదివాసీ జేఏసీ డిమాండ్.

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

అల్లూరి జిల్లా,దేవి పట్నం, సెప్టెంబర్19.

నిజంగా అర్హులైన అభ్యర్థులకు మాత్రమే పశువుల మీనీ గోకులాలు మంజూరు చేయాలని,దేవి పట్నం మండల కేంద్రములోని పశువుల హాస్పటల్ లో పశువుల డాక్టర్ను నియమించాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశుసంపద కలిగిన రైతులకు పశువుల మినీ గోకులాలు మంజూరు చేస్తామని గత నెల ఆగస్టు 23 తేదీన జరిగిన గ్రామ సభలలో అధికారులు తెలియజేశారు.అయితే షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 1/59, 1/70,మరియు పీసా చట్టం అమలులో ఉన్నందున పశుసంపద కలిగిన అదివాసులకు మాత్రమే మంజూరు చేయాలని,మైదాన ప్రాంతవాసులకు మంజూరు చేయవద్దని,మరియు ఎటువంటి బినామీ వ్యవస్థ లేకుండా పశుసంపద కలిగిన రైతులు ఉన్నారా లేదని ప్రాథమికంగా నిర్ధారించిన తరువాతనే పశువుల మినీ గోకులాలు మంజూరు చేయాలని,అలాగే సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి దేవి పట్నం మండల కేంద్రము లో ఉన్న పశువుల హాస్పటల్ లో డాక్టర్ను తక్షణమే నియమించాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు.

Related posts

ఆదివాసి కమ్యూనిటీ భవనం 0.05 సెంట్లు నిర్మాణానికి పర్మిషన్ కోసం తాసిల్దార్ కె.సత్యనారాయణకు వినతిపత్రం అందజేసిన.ఆదివాసి జేఏసీ నాయకులు.

AR TELUGU NEWS

ప్రతి ఒక్కరూ మీ దగ్గరలోని పోస్ట్ అఫీస్ లో ఎన్.పి.సి.ఐ చేయించుకోవాలి.

AR TELUGU NEWS

ఐటీడీఏ పీవో కు వినతి పత్రం ఇచ్చిన ఆదివాసి జేఏసీ నాయకులు,

AR TELUGU NEWS