March 14, 2025
Artelugunews.in | Telugu News App
పశ్చిమగోదావరి జిల్లాపెనుగొండ

ప్లకార్డులతో స్వచ్చతా హీ సేవ _ 2024 ర్యాలీ నిర్వహిస్తున్న సిబ్బంది ,విద్యార్థులు

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

పెనుగొండ మండలం వడలి గ్రామపంచాయతీ పరిధిలో *స్వచ్ఛతాహి సేవ-2024 కార్యక్రమాలలో* భాగంగా గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి కాసాని విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం నుండి ప్లాస్టిక్ నిషేధం, తడి చెత్త – పొడి చెత్త సేకరణ, వేరు చేయుట, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం జాంపేట రామాలయం వద్ద, పిట్టల వేమవరం రోడ్డు రామాలయం వద్ద మానవహారం నిర్వహించి , పంచాయతీ కార్యదర్శి శ్రీ P.A. రామకృష్ణ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యవర్గ సభ్యులు శ్రీ మేక శివయ్య , శ్రీమతి చలుమూరి పార్వతి , గ్రామ టిడిపి అధ్యక్షులు శ్రీ ఉప్పలపాటి చంటి , గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ అంగర వరప్రసాద్ , కూటమి నాయకులు, పంచాయితీ సిబ్బంది సచివాలయం సిబ్బంది ఆరోగ్య సిబ్బంది, డ్వాక్రా సిబ్బంది, డ్వాక్రా మహిళలు, ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

టీచర్స్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు

AR TELUGU NEWS

తాడేపల్లిగూడెం లో ఘనంగా ఎన్టీఆర్ జన్మదినోత్సవ వేడుకలు

AR TELUGU NEWS

వాసవిలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

AR TELUGU NEWS