March 14, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్

తూర్పుగోదావరి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

దేవరపల్లి మండలంలో బోల్తాపడిన జీడిపిక్కల లారీ

ప్రమాదంలో బోల్తాపడిన మినీ లారీ
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని బలిగొంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీలారీ బయలుదేరింది. ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి వాహనం దూసుకువెళ్లి తిరగబడింది. ఆ సమయంలో వాహనంలో 9 మంది జట్టు సభ్యులు ఉండగా డ్రైవర్‌ తప్పించుకుని పరారయ్యాడు. వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు దుర్మరణం చెందారు. గాయపడిన వారిలో ఒకరిని గంట మధు (తాడిమళ్ల)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ప్రమాదంలో మృతి చెందిన జట్టు కార్మికులు

మృతులు వీరే.

సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి.చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్‌ ఈ ఘటనలో మృతి చెందారు.

 

 

Related posts

త్వరలో జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్!

AR TELUGU NEWS

ఆంధ్రప్రదేశ్ లో మద్యం పాత బ్రాండ్లు అమ్మకాల గురు…

AR TELUGU NEWS

జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్

AR TELUGU NEWS