March 12, 2025
Artelugunews.in | Telugu News App
తెలంగాణ

హైదరాబాద్: నగర ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

హైదరాబాద్: నగర ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బస్సు చక్రాల కింద నలిగిపోయి దుర్మరణం చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముంబాయి వెళుతోంది. ఈ క్రమంలో నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ట్రావెల్స్ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు సమచారం. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలిస్తున్నారు. పోలీసులు గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. క్రేన్ సహాయంతో సిబ్బంది బస్సును తొలగిస్తున్నారు.

Related posts

వేదల్లోంచే అన్ని ఉద్భవిస్తాయి .. శ్రీనివాస్ వర్మ

AR TELUGU NEWS

ఎంబీసీ డైరెక్టర్ తుక్కియ్య కు అభినందనలు

AR TELUGU NEWS

సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ఉంటోంది – ఆర్ వో వి స్వామి నాయుడు.

AR TELUGU NEWS