నక్కలకాలువనుఆదునీకరించాలంటూ
కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా.
భీమవరం జూన్ 10.: పశ్చిమగోదావరి జిల్లాలోని పెరవలి మండలం కాకరపర్రు నుండి యలమంచిలి మండలం వడ్డిలంక వరకు ఉన్న నక్కల కాలువను తక్షణం ఆదునీకరించాలని, వడ్డిలంక వద్ద వున్న లిప్ట్ ఇరిగేషన్ ఉపయోగించి ముంపు నీరు బయటకు తోడేలా శాశ్వత పరిష్కారం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు, కౌలురైతు సంఘాల ఆద్వర్యంలో సోమవారం నాడు ప.గో.జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.