ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు జూన్ 11 వరకు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 12న ఓపెన్ అవ్వాలి. కానీ కొత్త ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో సెలవులు పొడిగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.. ఎందుకంటే..?
ఏపీ లో మరో నాలుగు రోజుల్లో వేసవి సెలవలు ముగియనున్నాయి. ఇప్పటికే స్కూల్స్ పున: ప్రారంభంపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో వైపు తెలంగాణలో బడిబాట కార్యక్రమం కూడా ప్రారంభమై అడ్మిషన్ల కోసం టీచర్లు ఊర్ల బాట పడుతున్నారు.అయితే ఏపీలో ఎన్నికలు నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైదొలగి టిడిపి కూటమి ప్రభుత్వ అధికారంలోకి రానుంది. జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే అదే రోజు స్కూల్స్ రీఓపెనింగ్ ఉండడంతో సెలవులు పొడిగించాలని విన్నతులు వస్తున్నాయి. టిడిపి నాయకులు సైతం అధికారులను కలిసి వినతి పత్రాలు అందిస్తున్నారు. జూన్ 12 కు బదులు జూన్ 13న స్కూల్స్ తెరవాలని కోరుతున్నారు. దీనిపై విద్యాశాఖ వర్గాలు స్పందించాల్సి ఉంది.