March 14, 2025
Artelugunews.in | Telugu News App
ఆచంటతెలంగాణపశ్చిమగోదావరి జిల్లా

సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ఉంటోంది – ఆర్ వో వి స్వామి నాయుడు.

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ఉంటోంది – ఆర్ వో వి స్వామి నాయుడు.

ఆచంట మే 28: సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్ల లెక్కింపు కు సంబంధించి స్థానిక రామేశ్వర స్వామి సత్రంలో సోమవారం నాడు నియోజవర్గ పరిధిలోని కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ నిర్వహించామని ఆర్వో వి స్వామి నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ ఓ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సీసీటీవీ కెమెరాల పరిరక్షణలో కొనసాగుతుందని అన్నారు. కౌంటింగ్ కు సంబంధించి సూపర్వైజర్లు అసిస్టెంట్లు మైక్రోఅబ్సర్వర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది జూన్ 4న ఉదయం 6 గంటలకు కౌంటింగ్ కేంద్రానికి విధిగా హాజరు కావాలని తెలిపారు. కంట్రోల్ యూనిట్ లో ఫలితాలు ఎలా చూపించాలనేది ప్రత్యక్షంగా కంట్రోల్యూనిట్ పై చూపించడం జరిగిందన్నారు. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయని వివరాలు లెక్కింపు కేంద్రంలో ఏర్పాటు చేసిన బోర్డుపై సిబ్బంది లిఖిస్తారని ఈ ప్రక్రియ వీడియో తీసి భద్రపరుస్తామని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో ఆచంట తాసిల్దార్ ఐ వి శెట్టి పెనుగొండ తహసీల్దార్ రోహిణి దేవి పెనుమంట్ర తహసిల్దార్ కే లక్ష్మీ కళ్యాణి పెనుగొండ ఎంపీడీవో ఎస్ శ్రీనివాస్ దొర పెనుమంట్ర ఎంపీడీవో పి పద్మజ పోడూరు ఎంపీడీవో డి సుహాసిని డిప్యూటీ తహసీల్దార్ ఎం రాంప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంటివద్దనే ఎన్.టి.ఆర్ భరోసా పించన్ల పంపిణీ సర్వం సిద్ధం…

AR TELUGU NEWS

Ts: తెలంగాణలో బీర్లకు ఫుల్ డిమాండ్

AR TELUGU NEWS

ఈనెల 30 నుంచి జాతీయస్థాయి నాటక పోటీలు

AR TELUGU NEWS